Telugudesam: టీడీపీని వీడేందుకు ఎవరూ సిద్ధంగా లేరు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

  • జగన్ వ్యాఖ్యలపై స్పందించిన గోరంట్ల
  • కేసీఆర్ తో సావాసం చేస్తున్న జగన్ అలా ఆలోచిస్తున్నారేమో!
  • నాడు వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు వీడారో జగన్ ఆలోచించుకోవాలి

టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు ఆ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని ఏపీ సీఎం జగన్ ఈరోజు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. ఓ చర్చా కార్యక్రమంలో ఈ విషయమై మాట్లాడారు. కేసీఆర్ సావాసంలో ఉన్న జగన్ కూడా ప్రతిపక్షం లేకుండా చేయాలన్న ఆలోచనలో ఉన్నారేమోనని వ్యాఖ్యానించారు.

తమ పార్టీని వీడేందుకు ఎవరూ సిద్ధంగా లేరని ఆయన స్పష్టం చేశారు. నాడు వైసీపీకి చెందిన 23 ముంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి టీడీపీలో ఎందుకు చేరారన్న విషయాన్ని జగన్ ఆలోచించుకోకుండా, ఆ ఎమ్మెల్యేలను తాము కొనుగోలు చేశామని ఆరోపించడం కరెక్టు కాదని హితవు పలికారు. ఏదేమైనప్పటికి, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి దేశ వ్యాప్తంగా ఓ చట్టం రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 

  • Loading...

More Telugu News