Cricket: బ్రిస్టల్ లో అదేపనిగా వర్షం.. టాస్ కు కూడా నోచుకోని పాకిస్థాన్-శ్రీలంక మ్యాచ్

  • తడిసి ముద్దయిన మైదానం
  • ఇంకా తగ్గని వర్షం
  • మ్యాచ్ రద్దయ్యే అవకాశం

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో వరుణుడు అప్పుడప్పుడు తన ప్రభావం చూపిస్తున్నాడు. తాజాగా, పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య బ్రిస్టల్ లో జరగాల్సిన మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది. బ్రిస్టల్ లో ఎడతెరిపి లేకుండా వాన పడుతుండడంతో మైదానం తడిసి ముద్దయింది. భారీ వర్షం కాకపోయినా, అదేపనిగా కురుస్తుండడంతో మైదానం చిత్తడిగా మారింది. వరుణుడి ధాటికి మ్యాచ్ లో కనీసం టాస్ వేయడానికి కూడా సాధ్యపడలేదు. ఈ మ్యాచ్ రద్దయితే పాకిస్థాన్, శ్రీలంక జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు.

  • Loading...

More Telugu News