fish venkat: నాతొ ఆ డైలాగ్ ను పవన్ పదిసార్లు చెప్పించి.. పడిపడి నవ్వారు: ఫిష్ వెంకట్

  • పవన్ గారితో 'ఖుషీ' చేశాను
  •  ఆయన మంచి నటుడు
  •  నన్ను ఆప్యాయంగా పిలిచేవారు   

కమెడియన్ గా మంచి మార్కులు తెచ్చుకున్న ఫిష్ వెంకట్, తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ గురించి ప్రస్తావించాడు. "పవన్ కల్యాణ్ తో నేను చేసిన తొలి చిత్రం 'ఖుషీ'. ఆ సినిమా షూటింగు జరుగుతోంది .. ఓ వైపున రౌడీ  గ్యాంగ్ .. మరో వైపున పవన్. మాపై ఫైట్ సీన్ ను చిత్రీకరిస్తున్నారు.

ఆ సమయంలో నేను నా పక్కనున్న రౌడీతో, "అరె ఉండు బే ఏంజెయ్యాల్నో సంజైతలేదు' అనే డైలాగ్ చెప్పాను. అంతే పవన్ కల్యాణ్ ఆగకుండా ఒకటే నవ్వు. ఆ డైలాగ్ నేను చెప్పిన తీరు బాగుందని, నాతో ఆ డైలాగ్ చెప్పించడం.. నవ్వడం.. అట్లా నాతో ఓ పదిసార్లు ఆ డైలాగ్ చెప్పించారు. అప్పటి నుంచి నన్ను ఆయన ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. అట్లా ఆ డైలాగ్ పవన్ కి నన్ను చేరువ చేసింది. పవన్ గారు మంచి నటుడు .. అంతకు మించిన మనసున్న మనిషి" అని ఆయన చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News