Cricket: సత్తాచాటిన బౌలింగ్ దళం... టీమిండియా టార్గెట్ 228 రన్స్

  • 50 ఓవర్లలో దక్షిణాఫ్రికా 227/9
  • చాహల్ కు 4 వికెట్లు
  • చెరో రెండు వికెట్లు తీసిన బుమ్రా, భువనేశ్వర్

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో భాగంగా సౌతాంప్టన్ లో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు సమష్టిగా సత్తా చాటారు. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా భారత బౌలర్ల ధాటికి 50 ఓవర్లలో 9 వికెట్లకు 227 పరుగులు మాత్రమే చేసింది.

చివర్లో క్రిస్ మోరిస్, రబాడా ధాటిగా ఆడడంతో సఫారీ స్కోరు ఆ మాత్రమైనా వచ్చింది. ఒక దశలో 158 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను మోరిస్, రబాడా ఆదుకున్నారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్ కు 66 పరుగులు జోడించారు. భువనేశ్వర్ కుమార్ (2/44) బౌలింగ్ లో మోరిస్ అవుట్ కావడంతో ఈ జోడీకి బ్రేక్ పడింది.

కాగా, ఈ మ్యాచ్ లో చాహల్ బౌలింగ్ హైలైట్ అని చెప్పాలి. చాహల్ 4 వికెట్లతో సఫారీల వెన్నువిరిచాడు. అంతకుముందు ఓపెనింగ్ స్పెల్ లో బుమ్రా (2/35) నిప్పులు చెరగడంతో దక్షిణాఫ్రికన్లు ఆరంభంలో దూకుడు ప్రదర్శించలేకపోయారు.

  • Loading...

More Telugu News