Cricket: నిప్పులు చెరుగుతున్న బుమ్రా.. ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా

  • టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న సఫారీలు
  • బౌన్సీ పిచ్ పై బుమ్రా దూకుడు
  • ఆమ్లా, డికాక్ అవుట్

సౌతాంప్టన్ పిచ్ పై టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగే బౌలింగ్ తో దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ కు పరీక్ష పెడుతున్నాడు. తన తొలి స్పెల్ లోనే సఫారీ ఓపెనర్లను బలిగొన్న బుమ్రా ఎంతో పొదుపుగా బౌలింగ్ చేసి తన స్థాయిని చాటుకున్నాడు. వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ పోరులో టాస్ గెలిచిన సఫారీలు బ్యాటింగ్ ఎంచుకున్నారు.

అయితే, బుమ్రా బంతులకు సఫారీ ఓపెనర్ల వద్ద బదులే లేకుండాపోయింది. 6 పరుగులు చేసిన ఆమ్లా, 10 పరుగులు చేసిన డికాక్ ఇద్దరినీ బుమ్రా అద్భుతమైన బంతులతో పెవిలియన్ చేర్చాడు. ప్రస్తుతం క్రీజులో వాన్ డెర్ డుసెన్ 8, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ 18 పరుగులతో ఆడుతున్నారు. 12.4 ఓవర్లకు ఆ జట్టు స్కోరు 2 వికెట్లకు 43 పరుగులు.

  • Loading...

More Telugu News