ntr: మైత్రీ బ్యానర్ పై 'కేజీఎఫ్' దర్శకుడితో ఎన్టీఆర్?

  • సంచలన విజయం సాధించిన 'కేజీఎఫ్'
  • ప్రశాంత్ నీల్ కి ఆఫర్ల వెల్లువ 
  • మైత్రీ బ్యానర్లో చేసే ఛాన్స్  

ప్రస్తుతం ఎన్టీఆర్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్ 2' షూటింగుతో బిజీగా వున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనుందనే టాక్ ఫిల్మ్ నగర్లో జోరుగా షికారు చేస్తోంది.

'కేజీఎఫ్' సినిమా సంచలన విజయాన్ని నమోదు చేయడంతో, దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడానికి స్టార్ హీరోలు ఆసక్తిని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో తమ బ్యానర్లో ఒక తెలుగు సినిమా చేసిపెట్టమని మైత్రీ మూవీ మేకర్స్ వారు ఆయనని ఒప్పించినట్టుగా చెప్పుకుంటున్నారు. అలాగే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. 'ఆర్ ఆర్ ఆర్' తరువాత ఎన్టీఆర్ చేసే సినిమా ఇదే అవుతుందని చెబుతున్నారు. 

ntr
  • Loading...

More Telugu News