TRS: టీఆర్ఎస్ అహంకారి వైఖరిని ప్రజలు వ్యతిరేకించారు: కిషన్ రెడ్డి

  • తెలంగాణలో ముఖ్యమైన స్థానాల్లో బీజేపీ గెలిచింది
  •  మజ్లిస్ పార్టీని కేసీఆర్ నమ్ముకున్నాడు 
  • ప్రజా సంఘాల నాయకులను కేసీఆర్ భయపెట్లాలని చూస్తున్నారు

తెలంగాణలో ముఖ్యమైన స్థానాల్లో బీజేపీ గెలిచిందని సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి విజయం సాధించిన కిషన్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు వ్యతిరేకించారని, అందుకే, తగిన సమాధానం చెప్పారని అన్నారు. మజ్లిస్ పార్టీని కేసీఆర్ నమ్ముకున్నాడని విమర్శించారు. అక్రమ కేసులతో ప్రజా సంఘాల నాయకులను కేసీఆర్ భయపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. 

  • Loading...

More Telugu News