Odisha: ఒడిశాలో రికార్డు స్థాయిలో వరుసగా ఐదోసారి విజయం సాధించిన నవీన్ పట్నాయక్

  • బీజేడీ హవా
  • ద్వితీయ స్థానంలో కాషాయదళం
  • సీఎం నవీన్ పట్నాయక్ కు విషెస్ తెలిపిన కేటీఆర్

పొరుగు రాష్ట్రం ఒడిశాలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా, అధికార బీజేడీ మరోసారి ఘనవిజయం సాధించింది. 146 సీట్లకు గాను బీజేడీ 106 స్థానాలతో ముందంజలో నిలిచింది. బీజేపీ 24, కాంగ్రెస్ 14, వామపక్షాలు ఒక్క స్థానంతో ఉన్నాయి.

కాగా, నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ వరుసగా ఐదోసారి విజయం సాధించడం పట్ల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 2000 నుంచి ఒడిశాలో బిజూ జనతాదళ్ పార్టీ అధికార పీఠంపై కొనసాగుతోంది. 2004, 2009, 2014లో కూడా బీజేడీనే విజయం వరించింది. ఈ నేపథ్యంలో, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కు విషెస్ తెలిపారు.

  • Loading...

More Telugu News