Mahesh Babu: వాళ్లు నా పేరు చెప్పగానే నవ్వుతారన్న కాంప్లిమెంట్ ను మించింది నా జీవితంలో వినలేదు: మహేశ్ బాబు

  • విజయవాడలో మహర్షి విజయోత్సవ వేడుకలు
  • భావోద్వేగాలకు లోనైన మహేశ్ బాబు
  • కొంతకాలంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మహేశ్ బాబు

టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబు నటించిన మహర్షి సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయోత్సవ వేడుకలు ఇవాళ విజయవాడలో జరిగాయి. ఈ మధ్యాహ్నమే బెజవాడ చేరుకున్న మహేశ్ బాబు, ఇతర యూనిట్ సభ్యులు ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మను దర్శించుకుని ఆపై విజయోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు.

"ఇంతకుముందు ఆంధ్రా హాస్పిటల్స్ నుంచి ఓ వ్యక్తి వచ్చి, పిల్లలకు సర్జరీ చేసేముందు మహేశ్ బాబు పేరు చెప్పగానే నవ్వేస్తారు అని చెప్పారు. నా జీవితంలో దీన్ని మించిన గొప్ప కాంప్లిమెంట్ మరొకటి వినలేదు సర్. థాంక్యూ సో మచ్! మీతో అనుబంధం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తెలియదు కానీ, ఎంతోమంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. హైదరాబాద్ లో ఉన్న మరో చిన్నారుల స్వచ్ఛంద సేవా సంస్థతోనూ కలిసి పనిచేస్తున్నాను. ఏడాదికి ఎంతమంది పిల్లల్ని కాపాడుతున్నారో ఆ దేవుడికే తెలుసు" అంటూ వ్యాఖ్యానించారు.

 మహేశ్ బాబు, నమ్రత దంపతులు కొన్నాళ్ల కిందట సిద్ధాపురం, బుర్రిపాలెం గ్రామాలను దత్తత తీసుకుని పరిసర ప్రాంతాల్లోని హృద్రోగపీడిత బాలలకు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహేశ్ పైవిధంగా స్పందించారు.

  • Loading...

More Telugu News