Guntur District: లోటస్ పాండ్ నుంచి వైసీపీ ప్రధాన కార్యాలయం అమరావతికి తరలింపు?

  • లోటస్ పాండ్ నుంచి అమరావతికి ఫర్నీచర్ తరలింపు
  • 16న ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించిన మీటింగ్ అమరావతిలోనే
  • 21 నుంచి వైసీపీ కార్యకలాపాలన్నీ అక్కడి నుంచే

హైదరాబాద్ లోని వైసీపీ ప్రధాన కార్యాలయం, జగన్ నివాసం ఏపీ రాజధాని అమరావతికి షిప్ట్ అవుతోంది. లోటస్ పాండ్ లో ఉన్న వైసీపీ ప్రధాన కార్యాలయం నుంచి ఫర్నీచర్ ను అమరావతికి తరలిస్తున్నారు. ఈ నెల 21 నుంచి వైసీపీ కార్యకలాపాలన్నీ అమరావతి నుంచే నిర్వహిస్తారని సమాచారం.

ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నేత రాంకుమార్ మాట్లాడుతూ, జగన్ పాదయాత్రలో బిజీగా ఉండటం, ఆ తర్వాత ఎన్నికలు రావడంతో అమరావతిలోని తన నివాసానికి ఆయన రాలేకపోయారని చెప్పారు. ఇప్పుడు, సమయం వచ్చింది కనుక అమరావతిలోని తన నివాసానికి జగన్ వస్తున్నారని వివరించారు. ఈ నెల 16న ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించిన మీటింగ్ అమరావతిలోని వైసీపీ కార్యాలయంలో జరగనున్నట్టు చెప్పారు. ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించబోతోందని, జగన్ సీఎం కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. 

  • Loading...

More Telugu News