Andhra Pradesh: మోదీ మతాల మధ్య చిచ్చుపెడతారు.. రాజకీయ నాయకత్వాన్ని చంపేస్తారు!: సీఎం చంద్రబాబు

  • మే 23 తర్వాత మోదీ తిరస్కరణ ఖాయం
  • మా పోరాటం ఈసీపై కాదు.. అధికారులపైనే
  • మేం ఈసీని కలిస్తే మోదీ ఉలిక్కిపడుతున్నారు

ఈ నెల 23 తర్వాత ప్రధాని మోదీని దేశ ప్రజలు తిరస్కరించడం ఖాయమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తమ పోరాటం ఎన్నికల సంఘంపై కాదనీ, ఎన్నికల సంఘం అధికారుల పక్షపాత, వివక్ష ధోరణిపైనేనని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలపై చర్యలు తీసుకునే విషయంలో ఈసీ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగానే తాము పోరాడుతున్నామని తేల్చిచెప్పారు.

రాజకీయ ప్రయోజనాల కోసం చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడటం మంచిది కాదని చంద్రబాబు హితవు పలికారు. రాజీవ్ గాంధీ నంబర్ వన్ అవినీతిపరుడు అని మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం ఈ మేరకు స్పందించారు.

మోదీ రాజకీయ లాభం కోసం రక్షణశాఖను, సైన్యాన్ని కూడా వాడుకుంటారని చంద్రబాబు విమర్శించారు. మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ నాయకత్వాన్ని చంపేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల షెడ్యూల్ కు ఈసీ 73 రోజులు తీసుకుందనీ, వీవీప్యాట్ల లెక్కింపునకు మరో 6 రోజులు తీసుకుంటే నష్టం ఏంటని ప్రశ్నించారు.

వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు విషయంలో ప్రతిపక్షాలు ఈసీని కలిస్తే మోదీ ఎందుకు ఉలిక్కి పడుతున్నారని నిలదీశారు. ఈ మేరకు చంద్రబాబు వరుస ట్వీట్లు చేశారు.

  • Loading...

More Telugu News