India: దేశంలో రేపు ఐదో విడత పోలింగ్... అన్ని ఏర్పాట్లు పూర్తి

  • 7 రాష్ట్రాల్లో 51 నియోజకవర్గాల్లో పోలింగ్
  • సోనియా, రాహుల్ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లోనూ పోలింగ్
  • అందరి దృష్టి అటువైపే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రేపు దేశవ్యాప్తంగా ఐదో విడత పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రాజ్ నాథ్ సింగ్, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ వంటి ప్రముఖులు ఈ విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఐదో దశ పోలింగ్ లో భాగంగా ఉత్తరాదిలోని 7 రాష్ట్రాల్లో 51 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది.

అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో 14 నియోజకవర్గాలు, రాజస్థాన్ లో 12, పశ్చిమ బెంగాల్ లో 7, మధ్యప్రదేశ్ లో 7, బీహార్ లో 5, ఝార్ఖండ్ లో 4, జమ్మూకాశ్మీర్ లో 2 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ప్రముఖులు బరిలో ఉండడంతో పలు నియోజకవర్గాలపై ప్రత్యేక ఆసక్తి కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News