Nara Lokesh: లోక్ సభ నాలుగో దశ పోలింగ్.. ఓటేసిన పలువురు సినీ ప్రముఖులు!

  • బీహార్ లో 10.75 శాతం, ఎంపీలో 10.09 శాతం పోలింగ్
  • ఓటేసిన ఆమిర్ ఖాన్ దంపతులు, ఊర్మిళ
  • కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన ఈసీ

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ పోలింగ్ జోరుగా సాగుతోంది. ఈ రోజు ఉదయం 9 గంటల నాటికి బీహార్‌ లో 10.75 శాతం, మధ్యప్రదేశ్‌ లో 10.09 శాతం, మహారాష్ట్రలో 4.09 శాతం, ఒడిశాలో 9 శాతం, రాజస్థాన్‌ లో 7.57 శాతం, యూపీలో 8.05శాతం, పశ్చిమ బెంగాల్‌ లో 16.74 శాతం, జార్ఖండ్‌ లో 10.94 శాతం పోలింగ్ నమోదయింది. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మిస్టర్ ఫర్ ఫెక్ట్ ఆమిర్ ఖాన్, ఆయన భార్య కిరణ్ రావ్ తో కలిసి బాంద్రాలోని అన్నెస్ హైస్కూలులో ఓటేశారు. అలాగే ఇటీవల కేన్సర్ ను జయించిన నటి సోనాలీ బింద్రేతో పాటు మాధురీ దీక్షిత్, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే సీపీఐ బెగుసరయ్ అభ్యర్థి, విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్, సినీ నటి ఉర్మిళ మతోండ్కర్‌ ఓటేశారు. పోలింగ్ సందర్భంగా శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.

  • Loading...

More Telugu News