NTR: ఎన్టీఆర్ ను లక్ష్మీపార్వతి డమ్మీగా మార్చేసింది!: డ్రైవర్ లక్ష్మణ్

  • ఎన్టీఆర్ నాశనం లక్ష్మీపార్వతితోనే మొదలైంది
  • ఇంటికి వచ్చినవాళ్లు ఆమెనే కలిసేవారు 
  • నన్ను తీసేయాలని కూడా చూసింది 

తెలుగు సినీ చరిత్రలో కానీ, రాజకీయ రంగంలో కానీ ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మళ్లీ రాడన్నది అతిశయోక్తికాదు. అయితే, అంతటి మహానుభావుడి జీవితం కూడా చివర్లో లక్ష్మీపార్వతి రంగప్రవేశంతో తీవ్ర ఒడిదుడుకులకు గురైంది. దీనిపై ఆయన కారు డ్రైవర్ లక్ష్మణ్ ఆసక్తికర వివరాలు తెలిపారు. ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్ష్మణ్ మాట్లాడుతూ, అంత మంచి వ్యక్తి జీవితం చివరిదశలో అత్యంత దయనీయంగా మారిపోవడం చూడలేకపోయానని అన్నారు.

ఇటీవల ఎన్టీఆర్ జీవితంపై వచ్చిన ఓ చిత్రాన్ని తాను చూడలేదని లక్ష్మణ్ తెలిపారు. ఎన్టీఆర్ గురించి కరెక్ట్ స్టోరీ ఏంటో తనకు తెలిసినప్పుడు ఆ సినిమా చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ను డమ్మీగా మార్చేసి లక్ష్మీపార్వతి రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నించిందని వెల్లడించారు. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే, ఎవరు ఇంటికి వచ్చినా మొదట లక్ష్మీపార్వతినే కలిసేవాళ్లని, ఇది ఊహించని పరిణామం అని డ్రైవర్ లక్ష్మణ్ పేర్కొన్నారు.

ఆ తర్వాత ఎన్టీఆర్ కు తాను విధేయుడిగా ఉండడం లక్ష్మీపార్వతికి రుచించలేదని, తనను విధుల నుంచి తొలగించేందుకు విశ్వప్రయత్నాలు చేసిందని చెప్పారు. "లక్ష్మణ్ తనకై తాను వెళ్లిపోవాలే తప్ప నేను తొలగించను" అంటూ ఎన్టీఆర్ ఆమెకు మొహమాటం లేకుండా చెప్పారని వివరించారు.

NTR
  • Loading...

More Telugu News