NTR: లక్ష్మీపార్వతి నిజస్వరూపం తెలిసి ఎన్టీఆర్ దిగ్భ్రాంతి చెందారు: డ్రైవర్ లక్ష్మణ్

  • అయినవాళ్లు చెబితే వినలేదంటూ పశ్చాత్తాపం చెందారు
  • డబ్బంతా పోయింది, సొమ్ములూ పోయాయి
  • ఆమె రాకతోనే ఎన్టీఆర్ నాశనం మొదలైంది

నందమూరి తారకరామారావు జీవితంలో చివరి అంకం సంచలనం సృష్టించడమే కాదు, తీవ్ర విమర్శలపాలైంది కూడా. ఆయన కుటుంబాన్ని రెండుగా చీల్చింది. లక్ష్మీపార్వతిని రెండో వివాహం చేసుకోవడం కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు ఎవరికీ ఇష్టంలేకపోయినా ఎన్టీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. అయితే, కాలక్రమంలో లక్ష్మీపార్వతి నిజస్వరూపం తెలిసి ఎన్టీఆర్ ఎంతో ఆవేదనకు గురయ్యారని, ఇలాంటి వ్యక్తి కోసమా కుటుంబ సభ్యులను దూరం చేసుకుంది అంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేశారని పర్సనల్ డ్రైవర్ లక్ష్మణ్ తెలిపారు.

"ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నేను, నా పిల్లలు మొత్తుకుంటున్నా వినకుండా ఈమెను చేసుకుని ఎంత తప్పు చేశాను" అంటూ బాధపడ్డారని వెల్లడించారు. ఒకరకంగా లక్ష్మీపార్వతి రాకతోనే ఎన్టీఆర్ పతనం ప్రారంభమైందని డ్రైవర్ లక్ష్మణ్  విచారం వ్యక్తం చేశారు. అమెరికాలో ఉంటున్న చిన్నకుమార్తె ఉమామహేశ్వరి కోసం రోడ్ నం.13లో ఇల్లు కొన్నారని, దాని పక్కనే మరో ఇల్లు తీసుకుని లక్ష్మీపార్వతికి ఇచ్చారని వివరించారు. దాన్ని లక్ష్మీపార్వతి అమ్ముకుని ఉండొచ్చంటూ సందేహం వెలిబుచ్చారు.

NTR
  • Loading...

More Telugu News