Andhra Pradesh: ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై దాడి.. 8 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు!

  • గుంటూరు జిల్లాలోని ఇనిమెట్లలో ఘటన
  • ఈ నెల 11న కోడెలపై పోలింగ్ సందర్భంగా దాడి
  • 30 మందిపై కేసు నమోదుచేసిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గుంటూరు జిల్లా టీడీపీ నేత, ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై ఇనిమెట్ల గ్రామంలో కొందరు దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దాడికి పాల్పడిన నిందితుల కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. ఈ సందర్భంగా తనిఖీలు చేపట్టిన పోలీస్ అధికారులు వీడియోల ఆధారంగా దాదాపు 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం వీరిని స్టేషన్ కు తరలించారు. అలాగే మరో 30 మందిపై కేసు నమోదుచేశారు. ఇనిమెట్లలో పోలింగ్ కేంద్రం వద్ద ఈ నెల 11న కోడెలపై దాడి జరిగింది. దీంతో చినిగిన చొక్కాతోనే ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • Loading...

More Telugu News