Chandrababu: తన మేనిఫెస్టోను దుర్గమ్మ పాదాల చెంత ఉంచిన చంద్రబాబు!

  • మేనిఫెస్టో ప్రతులకు ప్రత్యేక పూజలు
  • చంద్రబాబుకు పూర్ణకుంభంతో స్వాగతం
  • కాసేపట్లో టీడీపీ మేనిఫెస్టో

తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విజయవాడ, కనకదుర్గమ్మ సన్నిధికి తీసుకెళ్లిన చంద్రబాబు, ఆ ప్రతులను అమ్మవారి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు చేయించారు. తన సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాంశ్ తో కలిసి ఆలయానికి చేరుకున్న చంద్రబాబుకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయం లోపలికి వెళ్లిన ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు చంద్రబాబుకు వేదాశీర్వచనం ఇచ్చారు. భువనేశ్వరికి అమ్మవారికి ధరింపజేసిన వస్త్రాన్ని బహుమతిగా ఇచ్చారు. ప్రసాదాలను స్వీకరించిన అనంతరం, మేనిఫెస్టోను ప్రకటించేందుకు చంద్రబాబు బయలుదేరారు.

  • Loading...

More Telugu News