Tollywood: ఆంటీ, అంకుల్, అన్నయ్యా అంటూ రాజశేఖర్ కూతుళ్లిద్దరూ 800 మందికి ఫోన్లు చేశారు: సినీ నటి హేమ

  • ఆంటీ, అంకుల్ అంటూ ప్రేమగా మాట్లాడారు
  • 'మా' ఎన్నికలను వాళ్లిద్దరూ బాగా ప్రభావితం చేశారు
  • నాగబాబు చివరి నిమిషంలో నరేష్ ప్యానల్ వైపు నిలిచారు

టాలీవుడ్ లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నటి హేమ ఇటీవల ముగిసిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలిగా గెలిచారు. 'మా' ఎన్నికల్లో నరేష్, శివాజీరాజా వర్గాలు పోటీపడగా, హేమ ఏ ప్యానల్ లోనూ చేరకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించారు. అంతకుముందు ఆమె శివాజీరాజా ప్యానల్ లో ఈసీ మెంబర్ గా వ్యవహరించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హేమ మాట్లాడుతూ 'మా' ఎన్నికలపై మాట్లాడారు.

'మా' ఎన్నికల్లో నరేష్ వర్గం గెలవడానికి హీరో రాజశేఖర్ ఇద్దరు కుమార్తెలు కూడా కారణం అని తెలిపారు. వాళ్లిద్దరూ 'మా'లో సభ్యులుగా ఉన్న 800 మందికి ఫోన్లు చేసి ఎంతో ప్రేమగా మాట్లాడి పరిస్థితిని మార్చేశారని చెప్పారు. 'ఆంటీ', 'అంకుల్', 'అన్నయ్యా' అంటూ మొదలుపెట్టి, తమ తల్లిదండ్రులు మా ఎన్నికల్లో నిలబడ్డారని, వారి ప్యానల్ కు సపోర్ట్ చేయండంటూ అభ్యర్థించారని, వారి చొరవ బాగా పనిచేసిందని హేమ వివరించారు. చివర్లో నాగబాబు కూడా నరేష్ ప్యానల్ వైపు మొగ్గుచూపడం మరో కారణం అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News