malavika: 'పాడుతా తీయగా' ద్వారా మా కెరియర్ మొదలైంది: సింగర్స్ మాళవిక, కారుణ్య

  • 'గంగోత్రి'లో తొలిపాట పాడే అవకాశం వచ్చిందన్న మాళవిక
  •  'నువ్వూ నేను కలిసుంటేనే' పాటతో పాప్యులర్ అయ్యాను
  • 'అశోక్' సినిమాతో పరిచయమయ్యానన్న కారుణ్య      

తెలుగులో సినీ గాయనీగాయకులుగా కారుణ్య .. మాళవిక చాలా బాగా రాణిస్తూ వస్తున్నారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ ఇద్దరూ తమ కెరియర్ ను గురించి చెప్పుకొచ్చారు. మాళవిక మాట్లాడుతూ .. నేను .. కారుణ్య ఇద్దరం 'పాడుతా తీయగా' చిల్డ్రన్స్ సిరీస్ ద్వారా వేదికపైకి వచ్చాము. ఈ కార్యక్రమం మా ఇద్దరికీ ఎంతో గుర్తింపును తీసుకొచ్చింది. అయితే కారుణ్యకంటే ముందుగా సినిమాల్లో పాడే అవకాశం నాకు వచ్చింది. 'గంగోత్రి' సినిమాలో 'నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం' అనేది నా తొలి పాట. ఈ పాటతోనే నేను పాప్యులర్ అయ్యాను" అని అంది. ఇక కారుణ్య మాట్లాడుతూ .. " గాయకుడిగా మణిశర్మ గారు నన్నెంతగానో ప్రోత్సహించారు. ఎన్టీఆర్ 'అశోక్' సినిమాలో 'ఏకాంతంగా వున్నా .. ఎందరిలో వున్నా' అనే పాటను తొలిసారిగా సినిమా కోసం పాడాను. ఈ పాటను ఎంపిక చేసుకుని పాడే అవకాశాన్ని ఎన్టీఆర్ గారు నాకు ఇవ్వడం .. నేను చేసుకున్న అదృష్టం" అని చెప్పుకొచ్చాడు. 

  • Loading...

More Telugu News