India: సరిహద్దు ప్రాంతంలో పాక్ విమానాలు.. భారత యుద్ధవిమానాల రాకతో పరార్!

  • పాకిస్థాన్ రెచ్చగొట్టే చర్యలు
  • వెంటనే స్పందించిన భారత్
  • తోకముడిచిన దాయాది

  సరిహద్దు ప్రాంతంలో పాకిస్థాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. పాక్ వాయుసేనకు చెందిన 4 ఎఫ్-16 యుద్ధ విమానాలు, ఓ డ్రోన్ పంజాబ్ వద్ద భారత సరిహద్దు సమీపంలోకి వచ్చాయి. శత్రు విమానాల రాకతో భారత వాయుసేన అప్రమత్తమైంది. వెంటనే సుఖోయ్, మిరేజ్ యుద్ధ విమానాలు గాల్లోకి లేచి సరిహద్దు దిశగా దూసుకెళ్లాయి.

దాంతో, పాక్ విమానాలు ప్రమాదాన్ని పసిగట్టి తోకముడిచాయి. సర్జికల్ స్ట్రయిక్స్ తర్వాత పాకిస్థాన్ అనేక పర్యాయాలు భారత సరిహద్దు సమీపంలోకి వస్తూ రెచ్చగొడుతున్న సంగతి తెలిసిందే. తాజా ఘటనలో భారత వాయుసేన విమానాలు స్పందించక ముందు పాక్ యుద్ధ విమానాలు పంజాబ్ లోని ఖేమ్ కరన్ ప్రాంతంలో చక్కర్లు కొట్టినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News