Anantapur District: ఇక్కడి నుంచే పోటీ చేస్తానన్న పవన్ కల్యాణ్ కనిపించడే?: సీఎం చంద్రబాబు సెటైర్లు

  • మళ్లీ వస్తానన్న పవన్ ఇక కనపడలేదు!
  • జగన్ పై ఉన్నన్ని కేసులు దేశంలో ఎవరిపైనా లేవు
  • నేరస్థులకు, దొంగలకు మోదీ కాపలాదారు

అనంతపురం కరవు జిల్లా అని, ఆదుకుంటానని, ఇక్కడి నుంచే పోటీ చేస్తానంటూ మాటలు చెప్పిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కనిపించడం లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. అనంతపురంలో నిర్వహిస్తున్న రోడ్ షో లో ఆయన మాట్లాడుతూ, ఇటీవలే ఈ ప్రాంతంలో పవన్ పర్యటించారని, మళ్లీ వస్తానని చెప్పిన ఆయన ఇక కనపడలేదని వ్యంగ్యంగా అన్నారు. అనంతపురం జిల్లా అంటే తనకు ఎంతో అభిమానమని, ఇక్కడంతా మంచి మనసు ఉండే ప్రజానీకమని, రాష్ట్రంలో ఎక్కువ ఆదాయం వచ్చే జిల్లా అనంతపురం అని నిరూపిస్తానని చెప్పారు.

ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్, ప్రధాని మోదీపైనా విరుచుకుపడ్డారు. దేశానికి మోదీ కాపలాదారు కాదని, నేరస్థులకు, దొంగలకు ఆయన కాపలాదారులా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. 31 కేసులున్న జగన్ ను మోదీ కాపాడుతున్నారని, జగన్ పై ఉన్నన్ని కేసులు దేశంలో ఎవరిపైనా లేవని అన్నారు. వివేకా హత్య ఇంటి దొంగల పనేనని, ఈ హత్యను దాచిపెట్టాలని చూశారని, సిట్ నివేదికను బయటపెట్టొదని, సీబీఐ విచారణ కావాలని కోరుతున్నారని వైసీపీ నేతలను విమర్శించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే ప్రజల గెలుపు అని, నేరస్తులు గెలిస్తే ప్రజా ఓటమి అని అన్నారు.

  • Loading...

More Telugu News