payal: 'టైగర్ నాగేశ్వరరావు' బయోపిక్ లో పాయల్ చేయడం లేదట

  • వంశీకృష్ణ నుంచి ఇంట్రెస్టింగ్ బయోపిక్ 
  • 'టైగర్ నాగేశ్వరరావు'గా బెల్లంకొండ
  • స్టార్ హీరోయిన్ తో సంప్రదింపులు

తెలుగు తెరకి ఈ మధ్య కాలంలో పరిచయమైన గ్లామరస్ కథానాయికలలో పాయల్ రాజ్ పుత్ ఒకరు. 'ఆర్ ఎక్స్ 100' సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ సుందరిని వరుస అవకాశాలు పలకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే 'టైగర్ నాగేశ్వరరావు' బయోపిక్ లోను ఈ అమ్మాయిని తీసుకున్నారనే వార్తలు వచ్చాయి.

1980 - 90 దశకాల్లో స్టూవర్టుపురం' గజదొంగగా 'టైగర్ నాగేశ్వరరావు' ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వంశీకృష్ణ దర్శకత్వంలో ఈ బయోపిక్ సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. ఇంతకుముందు వంశీకృష్ణ దర్శకత్వం వహించిన 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' ఫరవాలేదనిపించుకుంది. 'టైగర్ నాగేశ్వర రావు' సినిమాలో కథానాయికగా ఇంకా ఎవరినీ తీసుకోలేదట. ఒక స్టార్ హీరోయిన్ తో సంప్రదింపులు జరుపుతున్నటుగా చెప్పుకుంటున్నారు. ఆ హీరోయిన్ ఎవరనేది త్వరలోనే తెలియనుంది.

  • Loading...

More Telugu News