Andhra Pradesh: రెండు రాష్ట్రాల్లోనూ ఓట్లున్న వారు 30 లక్షల మంది: ఏపీ సీఈఓ

  • రాజకీయ ఫిర్యాదు మేరకు ఈసీఐకి లేఖ రాసిన ద్వివేదీ
  • ఇరు రాష్ట్రాల్లోనూ ఒకే రోజున లోక్‌సభ ఎన్నికలు
  • రెండు చోట్లా ఉపయోగించుకునే అవకాశం ఉండడంతో అప్రమత్తమైన ఈసీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. రెండు రాష్ట్రాల్లోనూ ఓటుహక్కు కలిగిన వారు ఏకంగా 30 లక్షల మంది ఉన్నారని ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) గోపాల్ కృష్ణ ద్వివేదీ తెలిపారు. ఈ విషయాన్ని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) దృష్టికి లేఖ ద్వారా ఆయన తీసుకెళ్లారు. రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు కలిగిన వారు దాదాపు 30 లక్షల మంది వరకు ఉన్నారని రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేశాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు.

ఏపీ, తెలంగాణలో ఏప్రిల్ 11న ఒకేరోజు లోక్‌సభ ఎన్నికలు జరగనుండడంతో రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు కలిగిన వారు అక్కడ ఓటేసి ఇక్కడకు వచ్చే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలోనే డూప్లికేట్ ఓట్ల విషయంపై ఈసీఐకి లేఖ రాసినట్టు ద్వివేదీ తెలిపారు. ఈసీ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. ఆదేశాలు అందగానే రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు కలిగిన వారి ఓట్లను తొలగించనున్నట్టు తెలిపారు.

Andhra Pradesh
Telangana
Lok Sabha polls
Voters
CEO Gopal krishna
ECI
  • Loading...

More Telugu News