Congress: తెలంగాణ కాంగ్రెస్‌కు మరో దెబ్బ.. గులాబీ గూటికి చేరనున్న మరో ఎమ్మెల్యే!

  • ఇప్పటికే పార్టీని వీడుతామని ఐదుగురి ప్రకటన
  • తాజాగా కారెక్కేందుకు సిద్ధమవుతున్న సురేందర్
  • 19న కేసీఆర్ సభలో టీఆర్ఎస్‌లో చేరతారని ప్రచారం

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా గులాబీ గూటికి చేరుతున్నారు. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధమని ప్రకటించగా.. మరో ఎమ్మెల్యే అదే బాట పట్టారు. ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జాజుల సురేందర్ కూడా టీఆర్ఎస్‌లో చేరనున్నారని తెలుస్తోంది. ఈ విషయమై ఆయన ఇప్పటికే ఆ పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపారని.. 19న టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సభలో టీఆర్ఎస్‌లో చేరతారని ప్రచారం జరుగుతోంది.  

  • Loading...

More Telugu News