janasena: జనసేనకు రాజీనామా చేసిన యర్రా నవీన్

  • అభ్యర్థుల ఎంపికపై అసంతృప్తి
  • పార్టీ కోసం కష్టపడిన వారికి అన్యాయం జరుగుతోందంటూ మండిపాటు
  • వలస వచ్చిన వారికి టికెట్లు ఇస్తున్నారని ఆవేదన

జనసేన పార్టీకి పశ్చిమగోదావరి జిల్లా కోకన్వీనర్ యర్రా నవీన్ రాజీనామా చేశారు. అభ్యర్థుల ఎంపికపై అసంతృప్తితో పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ, పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా, ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి టికెట్లు ఇస్తున్నారని మండిపడ్డారు. ఇతర పార్టీల్లో టికెట్లు రాని వారు జనసేనలో చేరుతున్నారని చెప్పారు.

మరోవైపు ఈ సాయంత్రం రాజమండ్రిలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. ఈసభ నుంచి ఎన్నికల శంఖారావాన్ని పవన్ కల్యాణ్ పూరించనున్నారు. ఈ సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఈ సభకు భారీ ఎత్తున జనసైనికులు తరలిరానున్నారు.

  • Loading...

More Telugu News