Prudhvi Raj: అప్పటి నుంచి నాకు మామిడి పండ్లంటే భయం: 'పెళ్లి' పృథ్వీరాజ్

  • వైజాగ్ లో 'చెన్నకేశవరెడ్డి' షూటింగ్
  • రాత్రివేళల్లో యాక్షన్ సీన్స్ 
  • మామిడిపండ్లు ఎక్కువగా తినేశాను   

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో 'పెళ్లి' పృథ్వీరాజ్ మాట్లాడుతూ, తనకి మామిడి పండ్లంటే భయమంటూ అందుకుగల కారణాన్ని వివరించారు. బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి' సినిమాలో నేను ఒక ముఖ్యమైన రోల్ చేశాను. ఆ సినిమా షూటింగులో పాల్గొనడానికి నేను వైజాగ్ వెళ్లాను. 6 రోజులపాటు రాత్రివేళ మాత్రమే షూటింగు ఉంటుందని చెప్పారు. నాకు మామిడి పండ్లంటే చాలా ఇష్టం. ఆ విషయం ప్రొడక్షన్ టీమ్ కి చెబితే, ఒక బుట్టలో 35 .. 40 మామిడి పండ్లు తెచ్చి హోటల్లో నా  రూమ్ లో పెట్టారు.

అవి మంచి టేస్టుగా ఉండటంతో అన్నీ ఒకేసారి తినేశాను. ఆ రోజు రాత్రి ఇంకాసేపట్లో షూటింగ్ అనగా కడుపులో గుడగుడ మొదలైంది. అయినా బాలయ్య బాబుతో యాక్షన్ సీన్ కావడంతో లొకేషన్ కి వెళ్లాను. బాలయ్య బాబుతో ఫైట్ సీన్ .. ఆయన నన్ను కొట్టగానే 'అబ్బా' అంటూ పొట్ట దగ్గర పట్టుకుని కూలబడిపోయాను. మోషన్స్ మరింత ఎక్కువయ్యాయి .. ఫైట్ మాస్టర్ వచ్చి 'దెబ్బ బాగా తగిలిందా?' అని అడిగారు. వాళ్లకి అసలు విషయం చెప్పడంతో, షూటింగ్ కేన్సిల్ చేసి నన్ను హోటల్ కి పంపించేశారు. అప్పటి నుంచి నాకు మామిడిపండ్లంటే మహా భయం" అంటూ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News