YSRCP: నేడు వైసీపీకి ఎంతో ప్రత్యేకమైన రోజు: జగన్

  • వైసీపీ ఆవిర్భవించి తొమ్మిదేళ్లు
  • ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలన్న జగన్
  • మహానేత ఆశయాలను సజీవంగా ఉంచుతానని వెల్లడి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేడు ఎంతో ప్రత్యేకమైన రోజని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. సరిగ్గా తొమ్మిది సంవత్సరాల క్రితం, ఇదే మార్చి 12న ఆ పార్టీ ఆవిర్భవించింది. ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో గుర్తు చేసుకున్న జగన్, "మహానేత ఆశయాలను, పధకాలను సజీవంగా ఉంచేందుకు  వైయస్సార్ కాంగ్రెస్ ఆవిర్భవించి నేటికి తొమ్మిదేళ్లు. గత ఎనిమిదేళ్లుగా ప్రజా జీవితంలో సవాళ్లు, కష్టాలు, నష్టాలకు ఎదురొడ్డి ఈ పార్టీని భుజస్కందాలమీద మోసిన ప్రతి కుటుంబ సభ్యుడికి శుభాకాంక్షలు, వందనాలు" అని వ్యాఖ్యానించారు. మరోపక్క, రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆవిర్భావ వేడుకలను వైభవంగా జరుపుకునేందుకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. 

  • Loading...

More Telugu News