Rahul Gandhi: ​ రాహుల్ గాంధీకి డీఎన్ఏ టెస్టు చేయాలి: కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్డే

  • ముస్లిం తండ్రి, క్రిస్టియన్ తల్లికి పుట్టాడు
  • బ్రాహ్మణుడు ఎలా అవుతాడు?
  • రాహుల్ హైబ్రీడ్ జాతి అంటున్న కేంద్ర మంత్రి

కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్డే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. రాహుల్ గాంధీ ఓ హైబ్రీడ్ వ్యక్తి అని పేర్కొన్న హెగ్డే... ముస్లిం తండ్రికి, క్రిస్టియన్ తల్లికి పుట్టినవాడు బ్రాహ్మణుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు. కర్ణాటకలోని సిర్సి వద్ద బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాహుల్ తనను తాను హిందువునని అని చెప్పుకుంటున్నాడని, అసలు ఆయన బ్రాహ్మణుడో కాదో డీఎన్ఏ టెస్టు చేయాలంటూ వ్యాఖ్యానించారు. తాను జంధ్యం ధరించే హిందువునని చెబుతున్న రాహుల్ గాంధీ అందుకేమైనా సాక్ష్యాధారాలు ఇవ్వగలరా? అంటూ ప్రశ్నించారు. గతంలో ఓసారి, తాను ముస్లింనని రాజీవ్ గాంధీ చెప్పారని హెగ్డే ఈ సందర్భంగా గుర్తుచేశారు.

బాలాకోట్ వైమానిక దాడులు నిజమే అనడానికి ఆధారాలు ఏంటి? అని రాహుల్ కేంద్రాన్ని ప్రశ్నించిన నేపథ్యంలో మంత్రి అనంత్ కుమార్ హెగ్డే ఈ విధంగా విరుచుకుపడ్డారు. అయితే ఈ కేంద్రమంత్రి వ్యాఖ్యలపై కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాల ఆశీస్సులతోనే హెగ్డే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్ ఆరోపించారు.

  • Loading...

More Telugu News