Andhra Pradesh: టీడీపీ తొలి జాబితాకు రంగం సిద్ధం?

  • 12 లేదా 13 తేదీల్లో వెలువడనున్న తొలి జాబితా
  • వంద మందికి పైగా అభ్యర్థులతో జాబితా
  • పెండింగ్ లో వివాదంలో ఉన్న స్థానాలు 

కొన్ని రోజులుగా లోక్ సభ నియోజకవర్గాల వారీగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ తరపున అసెంబ్లీకి పోటీ చేసే వంద మందికి పైగా అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 12 లేదా 13వ తేదీల్లో టీడీపీ తొలి జాబితా విడుదల చేయాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. కాగా, వివాదంలో ఉన్న స్థానాలకు మాత్రం అభ్యర్థుల ప్రకటన పెండింగ్ లో ఉంచారు. ఆయా నియోజకవర్గాల్లో వివాదాలను పరిష్కరించేందుకు ఓ కమిటీని చంద్రబాబు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News