Andhra Pradesh: ముళ్ల పొదల్లో సజీవంగా చిన్నారి.. కాపాడి ఆసుపత్రికి తీసుకెళ్లిన స్థానికులు!

  • ఏపీలోని కర్నూలు జిల్లాలో ఘటన
  • ముళ్ల పొదల్లో చిన్నారి ఏడుపు
  • పాప ఆరోగ్యం స్థిరంగా ఉందన్న వైద్యులు

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. హోళిగుంద మండలం మెర్మికి గ్రామ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన ఆడ శిశువును ముళ్ల పొదల్లో పడేసి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా చిన్నారి ఏడుపు విన్న స్థానికులు పాపను రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఈ విషయమై వైద్యులు స్పందిస్తూ.. చిన్నారికి స్వల్ప గాయాలు అయ్యాయని తెలిపారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం స్థిరంగా ఉందని పేర్కొన్నారు. త్వరలోనే పోలీస్ అధికారుల సాయంతో చిన్నారిని బాలల సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని చెప్పారు.

Andhra Pradesh
Kurnool District
infant
hospital
Police
  • Loading...

More Telugu News