allu sirish: అల్లువారి అబ్బాయి సినిమా మళ్లీ వాయిదా?

  • అల్లు శిరీష్ నుంచి 'ఏబీసీడీ'
  • పూర్తికాని పోస్ట్ ప్రొడక్షన్ పనులు
  •  ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు      

అల్లు శిరీష్ .. సినిమాకి సినిమాకి మధ్య చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు. మంచి కథల కోసం వెయిట్ చేస్తుండటం వల్లనే ఈ గ్యాప్ వస్తోందని ఆయన చెబుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'ఏబీసీడీ' రూపొందింది. మలయాళంలో విజయవంతమైన 'ఏబీసీడీ'కి ఇది రీమేక్. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ముందుగా చెప్పినట్టుగానే మార్చి1వ తేదీనే విడుదల చేయవలసింది. కానీ కొన్ని కారణాల వలన మార్చి 21వ తేదీకి వాయిదా వేశారు.

ఇప్పుడు ఆ రోజున కూడా ఈ సినిమా థియేటర్లకు రావడం లేదనేది తాజా సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోని ఆలస్యమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అనుకున్న సమయానికి పనులు పూర్తికాకపోవడం వలన, ఏప్రిల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా అయినా అల్లు శిరీష్ కి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.

  • Loading...

More Telugu News