Mahesh Babu: మహేశ్ .. బన్నీలకి మధ్యలో ఎన్టీఆర్ ను కలిసిన సుకుమార్?

  • కథ పట్ల మహేశ్ అసంతృప్తి 
  • మార్పులకి అంగీకరించని సుకుమార్ 
  • ఇప్పుడే చెప్పలేనన్న ఎన్టీఆర్  

మహేశ్ బాబు .. సుకుమార్ కాంబినేషన్లో ఒక సినిమా చేయడానికి మైత్రీ మూవీ మేకర్స్ వారు రంగంలోకి దిగారు. అయితే సుకుమార్ వినిపించిన కథ మహేశ్ బాబుకి పూర్తిస్థాయిలో నచ్చలేదు. ఆయన సూచించిన మార్పులు చేయడానికి సుకుమార్ ఒప్పుకోలేదు. మైత్రీ మూవీ మేకర్స్ వారి నుంచి వత్తిడి ఎక్కువ కావడంతో, ఎన్టీఆర్ ను కలిసిన సుకుమార్, తదుపరి సినిమా తనతో వుంటుందని ఎనౌన్స్ చేయమని కోరాడట.

 'నాన్నకు ప్రేమతో' నుంచి ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. అయితే రాజమౌళి సినిమా ఎప్పటికి పూర్తయ్యేది తెలియదు గనుక, అలా తాను ఎనౌన్స్ చేయలేనని ఎన్టీఆర్ చెప్పాడట. అప్పుడే సుకుమార్ .. అల్లు అర్జున్ ని కలిసి ఈ కథ చెప్పాడని సమాచారం. సుకుమార్ పరిస్థితిని కూడా అర్థం చేసుకున్న అల్లు అర్జున్ .. త్రివిక్రమ్ తరువాత సినిమా సుకుమార్ తో ఉంటుందని ప్రకటించాడట. ఎన్టీఆర్ ను సుకుమార్ కలవడంలో వాస్తవమెంతో తెలియదుగానీ, ఫిల్మ్ నగర్లో ఈ టాక్ జోరుగా షికారు చేస్తోంది.

  • Loading...

More Telugu News