jagan: గవర్నర్ తో భేటీ అయిన జగన్.. రాజ్ భవన్ కు చేరిన ఓట్ల పంచాయతీ

  • డేటా కుంభకోణం, ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు
  • మూడు పేజీల లేఖ అందజేత
  • గంట క్రితం గవర్నర్ ను కలిసిన ఏపీ బీజేపీ నేతలు

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తో వైసీపీ అధినేత జగన్ భేటీ అయ్యారు. డేటా కుంభకోణం, ఏపీలో ఓట్ల తొలగింపు అంశాలపై ఈ సందర్భంగా గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. మూడు పేజీల లేఖను గవర్నర్ కు అందజేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా జగన్ తో పాటు పార్టీ సీనియర్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్థసారథి, పిల్లి సుభాష్ చంద్రబోస్ తదితర పది మంది నేతలు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు, గంట క్రితం ఇదే విషయంపై ఏపీ బీజేపీ నేతలు కూడా గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.

jagan
ysrcp
Telugudesam
data
theft
governor
narasimhan
  • Loading...

More Telugu News