samanta: స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే 'మహాసముద్రం'

  • 'ఆర్ ఎక్స్ 100'తో భారీ విజయం
  • తదుపరి సినిమాగా 'మహాసముద్రం'
  • త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు   

'ఆర్ ఎక్స్ 100' సినిమాతో దర్శకుడిగా అజయ్ భూపతి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా తరువాత ఆయన మరో కథపై కసరత్తు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆ కసరత్తు పూర్తయిందని సమాచారం. ఆల్రెడీ ఈ సినిమాకి ఆయన 'మహా సముద్రం' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నాడు.

ఇద్దరు హీరోలు .. కథానాయిక మనస్తత్వాలకి సంబంధించినదిగా ఈ టైటిల్ ఉంటుందని అంటున్నారు. విశాఖలో .. స్మగ్లింగ్ నేపథ్యంగా ఈ కథ కొనసాగుతుందని చెబుతున్నారు. ఈ కథలో అందమైన ప్రేమకథ .. అనూహ్యమైన మలుపులు వుంటాయని అంటున్నారు. కథలోని కొత్తదనం ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటుందని చెబుతున్నారు. నాయిక పాత్ర కోసం సమంతను ఎంపిక చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అందులో వాస్తవమెంతన్నది చూడాలి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 

  • Loading...

More Telugu News