nagapur: ధోనీ పరుగో పరుగు... అభిమానిని మైదానంలో ఆటపట్టించిన మాజీ కెప్టెన్‌!

  • రెండో వన్డే రెండో సెషన్‌లో ఆసక్తికర సన్నివేశం
  • సెక్యూరిటీ దాటుకుని షేక్‌హ్యాండ్‌ కోసం వచ్చిన ఓ అభిమాని
  • వికెట్ల వరకు పరుగున వెళ్లి అక్కడ చెయ్యి కలిపిన మిస్టర్‌ కూల్‌

 టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ఆటలో ఎంత సీరియస్‌గా ఉంటాడో మామూలు సమయాల్లో అంత జాలీగా కనిపిస్తాడు. అలాంటి ధోనీలోని సరదా గుణం నిన్న బయటపడింది. నాగపూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డే సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రెండో సెషన్‌లో భారత్‌ జట్టు ఫీల్డింగ్‌ కోసం మైదానంలోకి వెళుతోంది. ఆ సమయంలో భద్రతా వలయాన్ని ఛేదించుకుని ఓ అభిమాని మైదానంలోకి పరుగెత్తుకొచ్చాడు. ధోనీకి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చేందుకు ప్రయత్నించాడు.

ఆ అభిమాని నుంచి తప్పించుకునేందుకు ధోనీ మైదానంలో పరుగందుకున్నాడు. అయినా ఆ వీరాభిమాని వదలకుండా ధోనీ వెంటపడడంతో చివరికి వికెట్ల వద్దకు వెళ్లి ఆగిపోయాడు. వచ్చిన అభిమానికి షేక్‌ హ్యాండ్‌ ఇవ్వడంతో అతను ఆనందంతో ధోనీని ఆలింగనం చేసుకున్నాడు. అయితే కాసేపు అభిమానిని ఆటపట్టించేందుకే ధోనీ ఇలా పరిగెత్తాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.<iframe src="https://www.facebook.com/plugins/video.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2FNtvTeluguNews%2Fvideos%2F249815159300338%2F&show_text=0&width=560" width="560" height="308" style="border:none;overflow:hidden" scrolling="no" frameborder="0" allowTransparency="true" allowFullScreen="true"></iframe>

  • Loading...

More Telugu News