Mahesh Babu: 'అర్జున్ రెడ్డి' దర్శకుడి స్క్రిప్ట్ కి నో చెప్పిన మహేశ్ బాబు?

  • 'అర్జున్ రెడ్డి'తో సంచలన విజయం
  •  కథ విన్న మహేశ్ బాబు
  • భవిష్యత్తులో కలిసి చేద్దామంటూ మాట

'అర్జున్ రెడ్డి' సినిమాతో దర్శకుడు సందీప్ రెడ్డి సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హిందీలో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆయన మహేశ్ బాబుతో ఒక సినిమా చేసే ఛాన్స్ వున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పట్లో ఆ సినిమా వుండకపోవచ్చనేది తాజా సమాచారం.

మహేశ్ బాబు కోసం తాను సిద్ధం చేసిన కథను ఇటీవల ఆయనకి సందీప్ రెడ్డి వినిపించాడట. హీరో క్యారెక్టరైజేషన్ తన బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగా లేదని మహేశ్ బాబు చెప్పినట్టుగా సమాచారం. ఈ స్క్రిప్ట్ పక్కన పెట్టేసినా .. భవిష్యత్తులో తప్పకుండా కలిసి చేద్దామని సందీప్ కి మాట ఇచ్చాడట. ఈ నేపథ్యంలో 'కబీర్ సింగ్' హిందీ సినిమా తరువాత సందీప్ ఏ హీరోతో సెట్స్ పైకి వెళతాడనేది ఆసక్తికరంగా మారింది.

  • Loading...

More Telugu News