Andhra Pradesh: ఏపీకి రైల్వోజోన్ ఇస్తామని చెప్పి ఒక ‘మాయ జోన్’ ఇచ్చారు: కేంద్రంపై చంద్రబాబు ఫైర్

  • చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్ ని ఒడిశాకు ఇచ్చారు  
  • మనల్ని మోసం చేస్తున్నారు
  • ప్రయాణికులపై వచ్చే ఆదాయమే మనకొస్తుంది

ఏపీకి రైల్వోజోన్ ఇస్తామని చెప్పి ఒక ‘మాయ జోన్’ ని ఇచ్చిందని కేంద్ర ప్రభుత్వంపై సీఎం చంద్రబాబునాయుడు విరుచుకుపడ్డారు. ఏపీ రాష్ట్ర డీలర్ల ఆత్మీయ సదస్సును ఈరోజు విజయవాడలో నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఏపీకి రైల్వేజోన్ కావాలన్నది ఇక్కడి ప్రజల కల, అయితే, వాల్తేరుతో కూడిన రైల్వేజోన్ ఇవ్వాలన్నది ఉత్తరాంధ్ర వాసుల చిరకాల వాంఛ అని, ఆ కల నెరవేరలేదని అన్నారు. 125 సంవత్సరాల చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్ ని పక్క రాష్ట్రానికి ఇచ్చి, మనల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఆదాయం పక్క రాష్ట్రమైన ఒడిశాకు పోతుందని, ప్రయాణికులపై వచ్చే ఆదాయమే మనకు వచ్చేలా చేశారని చంద్రబాబు విమర్శించారు.

  • Loading...

More Telugu News