indian air force: కుప్పకూలిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానం.. ఇద్దరు పైలట్ల దుర్మరణం

  • జమ్ముకశ్మీర్ బుద్గాంలో కుప్పకూలిన మిగ్
  • విమానం కూలిన ప్రాంతంలో వ్యాపించిన మంటలు
  • విచారణకు ఆదేశించిన అధికారులు

జమ్ముకశ్మీర్ లోని బుద్గాంలో భారత వాయుసేనకు చెందిన మిగ్ యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు దుర్మరణం పాలయ్యారు. విమానం కూలిన ప్రాంతంలో మంటలు వ్యాపించాయి. అయితే, సైనిక విన్యాసాల్లో భాగంగా ఈ ప్రమాదం చోటుచేసుకుందా? లేక యుద్ద సన్నాహక చర్యల్లో భాగంగా ఈ ఘటన చోటు చేసుకుందా? అనే విషయంలో స్పష్టత లేదు. యుద్ధ విమానం కుప్పకూలిన ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. నిన్న తెల్లవారుజామున పాక్ భూభాగంపై భారత వాయుసేన ఎయిర్ స్ట్రయిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో దాదాపు 350 మంది టెర్రరిస్టులు హతమైనట్టు సమాచారం.

  • Loading...

More Telugu News