India: ఇప్పుడు పాకిస్థానీలు ఆసక్తిగా వెతుకుతున్నది దేని కోసమో తెలుసా..!

  • విపరీతంగా ట్రెండ్ అవుతున్న భారత వాయుసేన
  • పాక్ వాయుసేన కంటే ఐఏఎఫ్ పైనే పాక్ ప్రజల అమితాసక్తి
  • గూగుల్ ట్రెండ్స్ లో ఆశ్చర్యకర ఫలితాలు

పాకిస్థాన్ ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్ లో ఉన్న బాలాకోట్ ఉగ్రవాద స్థావరంపై భారత వాయుసేన మెరుపుదాడులు అంతర్జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇంటర్నెట్లో కూడా సర్జికల్ స్ట్రయిక్స్ అంశమే ట్రెండింగ్ లో ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పాకిస్థాన్ ప్రజలు ప్రస్తుతం ఇంటర్నెట్లో ఎక్కువగా వెదుకుతున్నది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించేనట.

గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ కంటే భారత వాయుసేన గురించి తెలుసుకోవడానికి ఎక్కువ మంది పాకిస్థానీలు ఆసక్తి చూపినట్టు వెల్లడైంది. మిరేజ్-2000 ఫైటర్ జెట్ విమానాలు తిరుగులేని కచ్చితత్వంతో జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ పాకిస్థాన్ ప్రజలను సైతం విస్మయానికి గురిచేసినట్టు గూగుల్ ట్రెండ్స్ ద్వారా అర్థం చేసుకోవచ్చు.

రాత్రివేళ చిమ్మచీకట్లో గురితప్పకుండా దాడిచేయడం పట్ల పాక్ సైన్యం కూడా దిగ్భ్రాంతికి గురైనా పైకి మాత్రం గంభీరంగా ప్రకటనలిస్తోంది. భారత్ జరిపిన ఈ దాడులు పాకిస్థాన్ మీడియాలో కూడా ప్రధాన అంశంగా మారాయి. ఎక్కడ చూసినా సర్జికల్ స్ట్రయిక్స్, బాలాకోట్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఎల్వోసీ, పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ అనే పదాలు సెర్చ్ లో ఎక్కువగా కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News