raghuveerareddy: కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు!: రఘువీరారెడ్డి

  • ప్రకాశం జిల్లాలో ప్రత్యేకహోదా భరోసా యాత్ర
  • రాష్ట్రంలోని దళితులు, మైనార్టీలు అభద్రతతో ఉన్నారు
  • కాంగ్రెస్‌ బలపడితేనే అణగారిన వర్గాలకు న్యాయం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు పూర్తి అభద్రతాభావంతో ఉన్నారని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ బలపడితేనే అణగారిన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఈ వర్గాలు భావిస్తున్నాయని, కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు.  ప్రకాశం జిల్లాలో ఈరోజు ప్రత్యేక హోదా భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దళితులపై దాడులు పెరిగాయన్నారు. దళితులు, మైనార్టీల హక్కులు పూర్తిగా అణచి వేస్తున్నారని చెప్పారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్‌ ప్రాధాన్యం ఇస్తుందని, బలహీన వర్గాలు కూడా కాంగ్రెస్‌తో కలిసి రావాలని పిలుపునిచ్చారు. టీడీపీ, వైసీపీల్లో సామాజిక స్పృహలేదని, ఈ రెండు పార్టీల్లో బలహీన వర్గాలు ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉన్నారని తెలిపారు. బీజేపీ బలహీన వర్గాలపై కక్షకట్టి వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణలో టీడీపీతో కలిసినడిచినందున ఆంధ్రప్రదేశ్‌లో కూడా నడవాలని ఏమీ లేదన్నారు.

  • Loading...

More Telugu News