India: పాక్ కు భారత్ 'జల'క్: మూడు నదుల నీళ్లు పాక్ కు మళ్లకుండా ‘కేంద్రం’ నిర్ణయం!

  • రావి, బియాస్, సట్లెజ్ నదుల నీళ్లు పాక్ కు వెళ్లనీయం
  • మన ప్రాజెక్టులు పూర్తయ్యాక ఈ నీళ్లన్నీ ‘యమున’కు  
  • మన వాటా సింధూ నదీ జలాలను పాక్ కు వెళ్లనీయం

పుల్వామాలో ‘ఉగ్ర’ దాడి ఘటన నేపథ్యంలో పాకిస్థాన్ పై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యల దిశగా నిర్ణయం తీసుకుంటోంది. పాకిస్థాన్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని 200% పెంచుతున్నట్టు ఐదు రోజుల క్రితం కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించడం తెలిసిందే. తాజాగా, రావి, బియాస్, సట్లెజ్ నదీ జలాలు పాకిస్థాన్ కు మళ్లకుండా ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.

కాగా, లక్నోలో ఈరోజు ఓ కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ, దేశ విభజన అనంతరం ఇరు దేశాల మధ్య చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం, రావి, బియాస్, సట్లెజ్  నదులపై భారత్ కు, సింధు, జీలం, చీనాబ్ నదులపై పాకిస్థాన్ కు పూర్తి హక్కులు లభించాయని అన్నారు. ఇక్కడ ప్రాజెక్టు నిర్మిస్తే కనుక పాక్ లోని నదుల్లోకి నీరు ప్రవహించదని, మన ప్రాజెక్టులు పూర్తి చేసిన తర్వాత ఈ నీళ్లన్నీ యమునా నదికి మళ్లిస్తామని అన్నారు. తద్వారా, మనకు మరిన్ని జలాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

సింధు నదీ జలాల విషయంలో మన దేశానికి రావాల్సిన వాటా జలాలను పాకిస్థాన్ కు వెళ్లనీయకుండా కేంద్రం నిర్ణయం తీసుకున్నట్టు ఓ ట్వీట్ లో గడ్కరీ పేర్కొన్నారు. ఆ నీటిని తూర్పు నదుల్లోకి మళ్లిస్తామని, జమ్మూ కశ్మీర్, పంజాబ్ లోని ప్రజలకు అందిస్తామని పేర్కొన్నారు. రావి నదిపై షాపుర్ కాందీ డ్యామ్ ప్రాజెక్టును ప్రారంభించినట్టు తెలిపారు. యూజేహెచ్ ప్రాజెక్టు ప్రాంతంలో మన వాటా నీళ్లను నిల్వ చేసి జమ్ముకశ్మీర్ కు అందిస్తామని స్పష్టం చేశారు. మిగులు జలాలను రావి-బియాస్ లింక్ ద్వారా ఆయా పరీవాహక ప్రాంతాలకు అందిస్తామని, ఈ ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటిస్తున్నట్టు తెలిపారు.

Under the leadership of Hon'ble PM Sri @narendramodi ji, Our Govt. has decided to stop our share of water which used to flow to Pakistan. We will divert  water from Eastern rivers and supply it to our people in Jammu and Kashmir and Punjab.

— Nitin Gadkari (@nitin_gadkari) February 21, 2019

  • Loading...

More Telugu News