prabhas: ప్రభాస్ 20వ సినిమా వచ్చేది వచ్చే ఏడాదిలోనే!

  • సాహో' షూటింగుతో బిజీగా ప్రభాస్
  •  తదుపరి సినిమా రాధాకృష్ణతో
  •  భారీ సెట్స్ లో చిత్రీకరణ    

ప్రభాస్ తాజా చిత్రంగా సుజిత్ దర్శకత్వంలో 'సాహో' నిర్మితమవుతోంది. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఆగస్టు 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఇక 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తోన్న సినిమాకి 'జాన్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రావొచ్చని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ సినిమా థియేటర్లకు వచ్చేది వచ్చే ఏడాదిలోనే అనేది తాజా సమాచారం. ఈ సినిమాను గురించి ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "ఈ సినిమాకి సంబంధించి ఒక షెడ్యూల్ ను ఇటలీలో పూర్తి చేశాము. ఈ సినిమా కోసం భారీ సెట్స్ అవసరం .. అందువలన ఈ సినిమా పూర్తి కావడానికి ఏడాదిన్నర పట్టొచ్చు" అని అన్నారు. అంటే వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావొచ్చునన్నమాట.

  • Loading...

More Telugu News