chenchul: చెంచుల ఆందోళన.. 'కర్నూలు-శ్రీశైలం-గుంటూరు' రహదారి దిగ్బంధం!

  • మాపై అటవీ అధికారులు దాడి చేస్తున్నారు
  • వేధింపులపాలు చేస్తున్నారని చెంచుల ఆరోపణ
  • శ్రీశైలం ఘాట్ లో భారీగా నిలిచిపోయిన వాహనాలు

కర్నూలు-శ్రీశైలం-గుంటూరు వెళ్లే రహదారి మార్గాన్ని చెంచులు దిగ్బంధించారు. శ్రీశైలం ఘాట్ లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఉపాధి పనులకు వెళ్లిన తమపై అటవీ అధికారులు దాడి చేస్తున్నారని చెంచులు ఆరోపిస్తున్నారు. అటవీ ప్రాంతంలో తమను వేధింపుల పాలు చేస్తున్నారని అన్నారు. కాగా, ఈ మార్గంలో రహదారిని చెంచులు దిగ్బంధించడంతో వాహనాలు అధిక సంఖ్యలో నిలిచిపోయాయి. లారీలు, బస్సులు, జీపులు తదితర వాహనదారులకు అసౌకర్యం కలిగింది.

  • Loading...

More Telugu News