Andhra Pradesh: పార్లమెంటు ప్రాంగణంలో ఆందోళనకు దిగిన టీడీపీ, వైసీపీ సభ్యులు!
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-f8a99b9ce7e22407fca04cb0819c4c551396e768.jpg)
- ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్
- హోదా ఆంధ్రుల హక్కు అని నినాదాలు
- ప్లకార్డులు ప్రదర్శించిన వైసీపీ సభ్యులు
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా, విభజన హామీలను అమలు చేయాలని కోరుతూ అటు టీడీపీ, ఇటు వైసీపీ సభ్యులు ఈరోజు పార్లమెంటు ఆవరణలో ఆందోళనకు దిగారు. గాంధీ విగ్రహం ముందు ఆందోళనకు దిగిన టీడీపీ సభ్యులు ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందని మండిపడ్డారు. ప్రత్యేకహోదా-ఆంధ్రుల హక్కు, ఏపీకి న్యాయం చేయాలి.. అంటూ నినాదాలు చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-607205a3507a85e3a4a99f22dd6c75323665eff6.jpg)