akhil: కష్టానికి తగిన ఫలితం లభించింది: హీరో అఖిల్

  • ఆడియన్స్ తో కలిసి సినిమా చూశాను
  • అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్
  • ఏడెనిమిది నెలలపాటు కష్టపడ్డాము        

అఖిల్ మూడవ సినిమాగా రూపొందిన 'మిస్టర్ మజ్ను' ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమా యూనిట్ కేక్ కట్ చేసి .. సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకుంది.

ఈ సందర్భంగా హీరో అఖిల్ మాట్లాడుతూ .. " హైదరాబాద్ 'దేవీ' థియేటర్లో ఆడియన్స్ తో కలిసి ఈ సినిమా చూశాను. ఆడియన్స్ రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. సినిమా విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి .. తమన్ ఈ సినిమా సక్సెస్ లో ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ ను సాధించాలనే పట్టుదలతో అందరం ఎంతో కష్టపడ్డాం .. ఏడెనిమిది నెలలపాటు మేము పడిన కష్టానికి తగిన ఫలితం లభించినందుకు సంతోషంగా వుంది" అని అన్నాడు. 

  • Loading...

More Telugu News