c.ramachandrayya: ఇప్పుడు రాజకీయాలన్నీ డబ్బుచుట్టూ తిరుగుతున్నాయి: మాజీ మంత్రి రామచంద్రయ్య

  • రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయి
  • అన్ని పార్టీలు డబ్బున్న వారికే ప్రాధాన్యం ఇస్తున్నాయి
  • మంచివాళ్లకు ఈతరంలో కాలం చెల్లింది

ఇప్పుడు రాజకీయాలన్నీ డబ్బు చుట్టూనే తిరుగుతున్నాయని, నిజాయితీగా రాజకీయాలు చేసే వారికి కాలం చెల్లిపోయిందని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు సి.రామచంద్రయ్య నిర్వేదంగా అన్నారు. పార్టీలు కూడా డబ్బున్న నాయకులకే ప్రాధాన్యం ఇస్తున్నాయని చెప్పారు.

పార్టీ నాయకుడు వై.వి.సుబ్బారెడ్డి, ప్రశాంత్‌కిశోర్‌తో కలిసి ఆయన నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం రాజకీయాల్లో అక్రమంగా ఆర్జిస్తున్న వారు కూడా డబ్బున్న వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. మంచివాళ్లు, నిజాయతీగా రాజకీయాలు చేద్దామని ఎవరైనా ముందుకు వచ్చినా మనుగడ కనిపించడం లేదని, పరిస్థితులు కూడా అందుకు సహకరించడం లేదని చెప్పారు. ఈ పరిస్థితిని చూస్తే మంచి రాజకీయాలకు కాలం చెల్లినట్టేనని భావించాల్సి వస్తోందన్నారు.

  • Loading...

More Telugu News