nagarjuna: 'మిస్టర్ మజ్ను'లో ఆ పాట వింటే నాకు 'సంతోషం' గుర్తొచ్చింది: అఖిల్ తో నాగార్జున

  • టైటిల్ నాకు బాగా నచ్చింది
  • ఆ రెండుపాటలు చాలా బాగున్నాయి
  • దర్శకుడు వెంకీ నాకు ముందే చెప్పాడు

వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ హీరోగా 'మిస్టర్ మజ్ను' సినిమా నిర్మితమైంది. నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అఖిల్ తో ఈ సినిమాను గురించి నాగార్జున ముచ్చటించారు. ''లైలా మజ్ను' టైటిల్ తో నాన్నగారు సినిమా చేయడం .. 'మజ్ను' పేరుతో నేను సినిమా చేయడం .. మళ్లీ ఇంతకాలానికి 'మిస్టర్ మజ్ను' టైటిల్ తో అఖిల్ చేయడం ఆనందంగా వుంది' అన్నారు నాగార్జున.

టైటిల్ వినగానే చాలా బాగుందనిపించింది. ఈ సినిమాలో 'కోపంగా .. కోపంగా' అనే పాట నాకు బాగా నచ్చింది. 'నాలో నీకు .. ' అనే పాట మరింత నచ్చింది. ఈ పాటలో కొన్ని లైన్స్ వింటుంటే 'సంతోషం' సినిమా గుర్తొచ్చింది. ఆ సినిమాలో 'నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా .. ' అనే పాటలా అనిపించింది. కథ చెప్పేటప్పుడే నాతో వెంకీ అన్నాడు .. 'మన్మథుడు' .. 'సంతోషం' తరహాలో ఇదో మంచి సినిమా అవుతుందని" అని నాగార్జున చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News