anushka: అనుష్క సినిమా కోసం 3 కోట్లు తీసుకుంటున్నాడట!

  • అనుష్క ప్రధానపాత్రధారిగా 'సైలెన్స్'
  • ముఖ్య పాత్రల్లో అంజలి .. షాలినీ పాండే
  • ఎక్కువభాగం షూటింగ్ అమెరికాలో

'భాగమతి' తర్వాత అనుష్క, తన తదుపరి సినిమాను హేమంత్ మధుకర్ దర్శకత్వంలో చేయనుంది. ఈ సినిమాకి 'సైలెన్స్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. వినికిడి లోపం కలిగిన మూగ అమ్మాయిగా ఈ సినిమాలో అనుష్క కనిపించనున్నట్టు తెలుస్తోంది. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో అంజలి ..షాలినీ పాండే .. అవసరాల .. సుబ్బరాజు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. అత్యధిక భాగం షూటింగ్ అమెరికాలో జరగనుంది. ఈ సినిమాలో ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడ్సన్ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. అమెరికాలో జరగనున్న షూటింగులో ఆయన పాల్గొననున్నాడు. ఈ సినిమా కోసం ఆయన అందుకుంటున్న పారితోషికం 3 కోట్లు అని తెలుస్తోంది. పాత్ర ప్రాముఖ్యతను బట్టి .. ఆయనకి గల క్రేజ్ ను బట్టి ఈ స్థాయి పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు అంగీకరించినట్టు సమాచారం. ఈ బహుభాషా చిత్రానికి కోన వెంకట్ ఒక నిర్మాతగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News