tamannah: తమన్నా ప్లేస్ లో కీర్తి సురేశ్ ను తీసుకున్నారట!

  • వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్
  • 75 శాతం చిత్రీకరణ అమెరికాలో 
  • దర్శకుడిగా నరేంద్ర పరిచయం  

'మహానటి' తరువాత కీర్తి సురేశ్ తమిళంలో వరుస విజయాలను అందుకుంది. తాజాగా రాజమౌళి మల్టీ స్టారర్ లోను ఆమె పేరు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె కథానాయిక ప్రాధాన్యత కలిగిన ఒక సినిమాను అంగీకరించింది. ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై నిన్ననే ఈ సినిమాను లాంచ్ చేశారు. ముందుగా ఈ సినిమాను తమన్నాతో అనుకున్నారనేది తాజా సమాచారం.

తమన్నాకి ఈ కథను వినిపించడం .. ఆమె ఆసక్తిని కనబరచడం జరిగిపోయాయట. ప్రస్తుతం వున్న ప్రాజెక్టులను పూర్తి చేసేసిన తరువాత చేద్దామని నిర్మాతలతో చెప్పిందట. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు గానీ, ఇప్పుడు తమన్నాకి బదులుగా కీర్తి సురేశ్ ను తీసేసుకున్నారు. వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. 75 శాతం షూటింగ్ అమెరికాలో జరపనున్నారని అంటున్నారు. ఈ సినిమా ద్వారా నరేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మొత్తానికి తమన్నా ఛాన్స్ ను కీర్తి సురేశ్ పట్టేసిందన్న మాట.

  • Loading...

More Telugu News