Telangana: తెలంగాణలో గెలిచారుగా, నాకు స్వీట్లు తినిపించరా?: టీఆర్ఎస్ ఎంపీలతో మోదీ సరదా వ్యాఖ్యలు

  • ఢిల్లీలో మోదీని కలిసిన టీఆర్ఎస్ ఎంపీలు
  • పార్టీ కార్యాలయానికి ఢిల్లీలో స్థలం కేటాయింపుపై వినతి
  • ఈ సందర్భంగా వారితో సరదాగా సంభాషించిన మోదీ

ఈ రోజు ప్రధాని మోదీని కలిసేందుకు వెళ్లిన టీఆర్ఎస్ ఎంపీలతో ఆయన సరదాగా జోకులు వేస్తూ మాట్లాడారు. టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత జితేందర్ రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ ఎంపీలు మోదీని ఈరోజు కలిశారు. ఢిల్లీలో తమ పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించాలని మోదీని కోరారు.

ఈ సందర్భంగానే వారితో మోదీ సరదాగా సంభాషించారు. తెలంగాణలో భారీ మెజార్టీతో గెలిచినా తనకు ఒక్క స్వీట్ కూడా తినిపించలేదని, మంత్రులు, ఎంపీలకు స్వీట్లు తినిపింని, తనకు తినిపించరా? అంటూ మోదీ నవ్వుతూ జితేందర్  రెడ్డితో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో ఎంపీలందరూ నవ్వేశారు.

ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి స్పందిస్తూ, పుల్లారెడ్డి స్వీట్స్ నుంచి ప్రత్యేకంగా తెప్పించి ఇస్తామని, బెల్లం, జీడిపప్పుతో చేసే మిఠాయి స్వయంగా తీసుకొచ్చి ఇస్తామని మోదీకి చెప్పడంతో నవ్వులు విరిశాయి. పార్లమెంట్ లో తమ పార్టీ ఎంపీలు 17 మంది ఉన్నారని, చట్ట ప్రకారం వెయ్యి చదరపు గజాల స్థలం తమకు కేటాయించాలని, ఢిల్లీలోని రాజేంద్రప్రసాద్ రోడ్డులో ఉన్న ఖాళీ స్థలాన్ని పార్టీ కార్యాలయానికి కేటాయించాలని ప్రధానికి వారు విజ్ఞప్తి చేశారు. 

  • Loading...

More Telugu News